SAKSHITHA NEWS

ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 20వ డివిజన్ పూజిత ఎంక్లేవ్ కు చెందిన సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా కలిసిమెలిసి ఉంటూ కాలనీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకుడు చంద్రగిరి సతీష్, ప్రెసిడెంట్ సుధాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, సుభాషిణి, సెక్రెటరీ శరత్ చౌదరీ, ట్రెజరర్ కృష్ణ వాణి నాయుడు, కో ట్రెజరర్ భాను, నర్సింహా రెడ్డి, వీరభద్ర రావు, రమేష్, ప్రశాంత్ రెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS