SAKSHITHA NEWS

The leaders who participated in the bike rally..

ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు,బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు…


మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే జిఎంఆర్, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నాగేష్ యాదవ్ , ఆదర్శ్ రెడ్డి , ప్రభాకర్ , వి.హన్మంత్ రెడ్డి (బొల్లారం మున్సిపల్ తెరాసా పార్టీ అధ్యక్షుడు), వెంకటేష్ గౌడ్ , రాష్ట్ర కార్మిక నాయకుడు వి.వరప్రసాద్ రెడ్డి , నాయకులు లక్కన్ , నరేందర్ , దిగంబర్ , తివారి , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS