SAKSHITHA NEWS

సమస్యల పాలెం… నరసాయపాలెం


సాక్షిత యర్రగొండపాలెం (మండలం) : మండలంలోని నరసాయపాలెం లో నివసిస్తున్న ఎస్సీ పాలెం వాసులకు… సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల…. మురుగునీరు అక్కడే నిలిచిపోయి…. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని….
వంద కుటుంబాల వరకు నివసిస్తున్నటువంటి మా పల్లెలో కేవలం రెండే విద్యుత్ దీపాలు మాత్రమే వెలుగుతూ ఉంటాయని… రాత్రులు పాలానికి వచ్చే వారికి చాలా ఇబ్బందిగా ఉందని మిగతా వాటిని బాగు చేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా గ్రామ సర్పంచ్ నుంచి సరైన స్పందన లేదని…సాగర్ నీరు కూడా అంతంత మాత్రం గానే అందుతున్నాయని…..నరసాయపాలెం


వచ్చే గ్రామస్తులకు రెండు కిలోమీటర్ మేర తారు రోడ్డు….మరో మూడు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు వర్షం పడినప్పుడు ఈ రోడ్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు తీసుకొని మా సమస్యలను పరిష్కరించాలని పాలెం వాసులు కోరుతున్నారు.


SAKSHITHA NEWS