SAKSHITHA NEWS

Swearing in of MPs of Parliament

పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ:
పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది.

మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమా ణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హాజరుకానున్నారు.

తొలిరోజు 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి మండలి సహా… పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేశారు.

ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా 262 మందితో ప్రొటెం స్పీకర్ భతృహరి మెహతాబ్ ఎంపీలుగా ప్రమాణం చేయించారు…


SAKSHITHA NEWS