SAKSHITHA NEWS

కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఉన్ని వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు 41 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశం రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసి జనంలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది ఎన్టీఆర్ పుణ్యమే. అసలు ప్రజలకు దేవుడు ఇచ్చిన భూమికి శిస్తు ఏమిటి రైతన్న అన్నారు. భూమి శిస్తు రద్దు చేశారు. దేశంలో మొదటిసారి సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వత బంధువుగా నిలిచిపోయిన జీవన ప్రమాణాలు పెంచడానికి కొత్త రీతిలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు రూపొందించిన పార్టీ తెలుగుదేశం. విద్యుత్, సాగు, తాగు నీరు, రహదారులు, సబ్సిడీ బియ్యం, వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, పార్లమెంట్ కమిటీ నాయకులు, జిల్లా కమిటి నాయకులు, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు యువత, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS