SAKSHITHA NEWS

విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

ఈరోజు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుం నగర్, అంజయ్య నగర్ ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, పాపయ్య గౌడ్, ఆజం, నర్సింగ్ గౌడ్, రాజలింగం గౌడ్, నరసయ్య ,వెంకటేష్, ఖలీల్, ఖయ్యూం, బాలు,గణేష్, సంతోష్, విగ్నేష్, రాజు, ప్రధానోపాధ్యాయులు కమల, కిషన్, తెరాస కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS