SAKSHITHA NEWS

-జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న 16 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ ఐ లుగా పదోన్నతి

–పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి – యస్.పి

నల్లగొండ సాక్షిత

పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలని యస్.పి అపూర్వ రావు ఐపిఎస్ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న 16 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఎ ఎస్ ఐ లుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేయడం జరిగింది. పదోన్నతి పొందిన ఏఎస్ఐ లకు యస్.పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలి అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యల అడిగి తెలుసుకొని బాధితులకు సరిఅయిన న్యాయం జరిగే విదంగా పనిచేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS