SAKSHITHA NEWS

సాక్షిత : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి ఘననివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే రేవంత్ అన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని తెలిపారు. ప్రజలందరూ రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని
తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, NSUI కుత్బుల్లాపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి సాయి,మైనారిటీ నాయకులు చాంద్ పాషా, మక్బుల్, మేకల ఎల్లయ్య,చెవిటి శ్రీనివాస్,లక్ష్మీనారాయణ, సంజీవ్,శ్రీనివాస్, దినేష్, మురళి, రమేష్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS