SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బహదూర్ పల్లి 14వ వార్డులో రూ.47 లక్షల వ్యయంతో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు కమిషనర్ సత్యనారాయణ గార్లతో కలిసి శంకుస్థాపన చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీ.అర్.ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు.

మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీ సభ్యులతో కలిసి వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎల్లుగారి సత్యనారాయణ, భారత్ కుమార్, సీనియర్ నాయకులు మైసిగారి వెంకటేష్, శివనూరి మల్లేష్, సగ్గిడి శ్రీనివాస్, మునిసిపల్ యూత్ అద్యక్షులు మైసిగారి శ్రీకాంత్, వార్డు ప్రెసిడెంట్ శ్యామ్, నాయకులు బైండ్ల శ్రీను, తుడుము ఈశ్వర్, లింగాల వెంకటేష్, రాజేష్, రము, కాలనీ సభ్యులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS