SAKSHITHA NEWS

Sarpanch Dyapa Nikhil Reddy is the source of support in distress

ఆపదలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడుమాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి

సాక్షిత ప్రతినిధి.

ఉర్కొండ: మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన బిజినపల్లి బాలయ్య* అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.

డిఎన్ ఆర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.ఐదు వేల రూ5000 అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ మండలంలో ఎంతమంది నాయకులు ఉన్న తనదైన శైలిలో ప్రజల్లో మమేకమైతు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసానిస్తున్న ఏకైక వ్యక్తి డిఎన్ఆర్ అని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఆపదలలో ఆదుకుంటున్న ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజలు దీవెనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్స్ కవిత రుక్మా రెడ్డి, అలివేల, ఇద్దయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తయ్య, చిదిరే విశ్వనాధం, బీరయ్య, చంద్ర శేఖర్, మాధవ రెడ్డి, దాసరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS