SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన రోడామేస్త్రి నగర్ (A) కాలనీవాసులు ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 – చింతల్ డివిజన్ పరిధిలోని ఈద్గాహ్ హాజీ డెవలప్మెంట్ కమిటీ మరియు జమ మస్జీద్ హాజీ అలీ కమిటీ అద్వర్యం లో రోడామేస్త్రి నగర్(A ) కాలనీ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కే.పి వివేకానంద కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేసారు.

ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కాలనీల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అలాగే తమ కాలనీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని మా కాలనీ అభివృద్ధిని కొనసాగించుకుంటామని కాలనీ వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ మఖ్సూద్ అలీ, సయిద్ రషీద్, వైస్ ప్రెసిడెంట్ ఎం డి యూనుస్ ఖాన్, మీర్జా అలీ బైగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యూనుస్ పాశా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఉస్మాన్, నాయబ్ రసూల్, జాయింట్ సెక్రటరీ అర్మాన్ ఖాన్, మహమ్మద్ అఫ్సర్ అలీ, కౌశదీకరి ఎం డి హబీబుద్దీన్, మహమ్మద్ బషీర్ మరియు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 13 At 5.52.18 Pm

SAKSHITHA NEWS