SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టు సోదరులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అర్హులైనా జర్నలిస్టులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ కట్టుబడి ఉన్నారు అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర గుర్తించి, ఇళ్ళ స్థలాలను అందించడం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంగం మేడ్చల్ ప్రెసిడెంట్ జి బాలరాజు, కుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ కే శ్రీనివాస్, సాయిబాబా ,జిల్లా నాయకులూ దయాకర్ రెడ్డి, కే వెంకట్, డి రామస్వామి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS