SAKSHITHA NEWS

వార్డు సమస్యలని పరిష్కరించాలని ఎమ్మెల్యే కి వినతి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ని బిజెపి నాయకులు కోరారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 7వ వార్డ్ లోని బీజేపీ ఆధ్వర్యంలో వార్డు లోని పలు సమస్యల గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వార్డులో అర్హులైన పేదలకు డబుల్ బ్రేడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, అంగన్వాడీ పక్క భవనాన్ని నిర్మించాలని వార్డు లోని భాగ్యనగర్ వెంచర్ లో అన్యాక్రాంతం అయిన 10% భూమిని గుర్తించాలని, అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి అన్ని బజార్ లో వేసి వాటిపైన సిసి వేయాలని కోరారు. అలాగే నిరుపయోగంగా ఉన్న శ్రీ శక్తి భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని, రోడ్డు రద్దీ దృశ్య వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూరేళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు కోళ్ల స్వామి, కిసాన్ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ జిట్టా కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు పాల రవి వర్మ, బూత్ అధ్యక్షుడు కుక్కల నాగరాజు, సుంచు శ్రీను, పాల శివకుమార్ , మంద వంశీ,రాహుల్ ,పిల్లి రవి, జిట్టా నాగరాజు,చేగురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS