SAKSHITHA NEWS

గౌడ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ కార్పొరేటర్ కి వినతి…

మల్కాజిగిరి
01 సెప్టెంబర్

మల్కాజిగిరి నియోజకవర్గం ,ఓల్డ్ నేరెడీమేట్ గౌడ సంఘం ప్రతినిధులు ఆదివారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ని కలిసి కోర్ట్ సమస్యలలో ఉన్న గౌడ స్మశాన వాటికను అభివృద్ధి చెయ్యాలని కోరడం జరిగింది. కొంత మంది స్వార్ధ పరులు దురుద్దేశంతో అనవసరపు కేసులు వేశారని, జిహెచ్ఎంసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తప్పకుండ సమస్యను అధికారులతో కలిసి సమీక్షించి తగిన చెర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ శ్రవణ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జె. అభిషేక్ గౌడ, టీ. నరేందర్, టీ. పవన్ కుమార్, జె. వినోద్, ఎం. శ్రీకాంత్, కె. శ్రీధర్, జి. జహంగీర్, జి. ప్రవీణ్ గౌడ, జె. లక్సమన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS