SAKSHITHA NEWS

Rastaroko dharna in Huzurabad and Jammikunta to protest illegal arrest of Balmuri Venkat

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ అక్రమ అరెస్టు నిరసనగా హుజురాబాద్ మరియు జమ్మికుంటలో రాస్తారోకో ధర్నా నిరసనలు

నిన్న NSUI అసెంబ్లీ ముట్టడిలో భాగంగా బల్మూర్ వెంకట్, NSUI నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక జమ్మికుంట గాంధీ చౌక్ లో NSUI మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా NSUI కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ మొహమ్మద్ మరియు మాజీ టౌన్ ప్రెసిడెంట్ కసుబుసుల వెంకన్న మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ ముట్టడి ఎస్సై , కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో జరుగుతున్న అవకతవకల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్రా అధ్యక్షులు వెంకట్ బల్మూర్ గారితో పాటు మరో నలుగురు NSUI నాయకులని అరెస్ట్ చేసి ముషీరాబాద్ స్టేషన్ కి తరలించారు, తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియదు,దాదాపు 24 గంటలు కావొస్తున్న ఇప్పటికి ఆచూకీ చెప్పలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుశాఖ ఉంది కావున మా నాయకులనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల NSUI ఆధ్వర్యంలో కలెక్టరేట్, కమిషనరేట్ మరియు సెక్రటేరియట్ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఇమ్రాన్, మాజీ పట్టణ అధ్యక్షులు కసుబోసుల వెంకన్న, ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పగ్గని శ్రీనివాస్ మాజీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, చిన్నింటి నాగేంద్ర , ఎండి సలీం పాషా కొత్తపల్లి, సుంకరి రమేష్ సీనియర్ నాయకులు, చిలువేరు రాజమౌళి మాజీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్, గొట్టి ప్రభుదాస్ , ఆకినపల్లి మహేందర్, k.శ్రీనివాస్ , ఎండి నయీం, ఎండీ సాదిక్, ఎండీ సమీర్, ఎండీ పర్వెస్, ఎండీ హర్షద్, రంజిత్ రెడ్డి, సమ్మయ్య, హైమద్, ప్రణయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS