SAKSHITHA NEWS

రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ..జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్.

సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద గల రాజరాజేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. రాంకీ సీఈఓ లాల్ కృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో ఆయనతోపాటు జీవీఎంసీ 79 వ వార్డు జనసేన సీనియర్ నాయకులు సుందరపు శ్రీనివాస్ రాజ్యలక్ష్మి దంపతులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో రాంకీ ప్రతినిధి రాఘవరెడ్డి, జనసేన నాయకులు త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS