SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరువలేనిది …….. జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్

*సాక్షిత వనపర్తి :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి తెలంగాణ ప్రజలు మరువలేనిదని జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్ అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ తేజావత్ మాట్లాడుతూ తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక రాజకీయ అణిచివేత చర్యలను తీవ్రంగా ఖండించారని తెలంగాణ ఉద్యమంలో సకలజనుల భాగస్వామ్యం చేయడానికి రాజకీయ ప్రజా ఆందోళనల ప్రక్రియ లకు ప్రాధాన్యత ఇచ్చారని ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్ని ఆస్తిని అంకితం చేసిన మహానుభావుడని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వరరావు సూపరన్ సూపర్డెంట్ ఇంతియాజ్ ఎస్బిఎస్ఐలు పోలీస్ సిబ్బంది పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS