
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్ జిల్లా తూప్రాన్కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్గౌడ్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. సభా స్థలం కోసం సోమవారం తూప్రాన్ శివారులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. పురపాలిక పరిధి టాటా కాఫీ పరిశ్రమ వెనుక ఉన్న 80 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగళ, బుధవారాల్లో పూర్తి షెడ్యూల్ వస్తుందన్నారు. అప్పటిలోగా స్థలాన్ని ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు సాయిబాబాగౌడ్, నందన్గౌడ్, బాలపోచయ్య, సర్పంచులు నత్తి మల్లేశ్, పిట్ల పోచయ్య పాల్గొన్నారు.
