SAKSHITHA NEWS

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని అదే పేరుతో కొనసాగించాలి……… డాక్టర్ పూరి సురేష్ శెట్టి

సాక్షిత వనపర్తి ఆగస్టు 3
తెలంగాణలో పొట్టి శ్రీరాములు పేరుతో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాన్ని ఎవరికీ అభ్యంతరాలు లేకుంటే సాహితీ ప్రియులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయడం లాంటిదేనని వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి పత్రికా ప్రకటనలో అభిప్రాయపడ్డారు. నాటి మద్రాస్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ను తెలుగువారి కోసం తన ప్రాణాలను త్యాగం చేసి తెలుగువారి కోసం ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పాలమూరు జిల్లా అలంపూర్ ప్రాంతవాసి అయిన సాహితీ ప్రియులు సురవరం ప్రతాపరెడ్డి ది తనది ఒకే ప్రాంతమని ఆయన వనపర్తి మొదటి శాసనసభ్యులుగా కొనసాగారని ఆయన అంటే తమకు కూడా అభిమానమే పొట్టి శ్రీరాములు గా కొనసాగుతున్న విశ్వవిద్యాలయం నీకి సురవరం పేరు మార్చడం సరేంది కాదని అంతకంటే ముఖ్యమైన వాటికి ప్రతాపరెడ్డి పేరును నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కి ఆయన విజ్ఞప్తి చేశారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS