SAKSHITHA NEWS

Ponguleti’s tribute to Kondabala’s wife

కొండబాల సతీమణికి పొంగులేటి నివాళి

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని కొండకొడిమలో జరిగిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సతీమణి రాజేశ్వరమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఆమె భౌతికాయానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఆమె మృతి కొండబాల కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుణ్ణి వేడుకున్నారు. అంత్యక్రియల్లో పొంగులేటితో పాటు రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతగాని జైపాల్, ఎంపీపీ గోసు మధు, ఖమ్మం కార్పొరేటర్ మలీదు జగన్, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్.ఆర్.వో కుటుంబానికి పొంగులేటి పరామర్శ

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రఘునాథపాలెం మండలంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని ఈర్లపూడి గ్రామంలో ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో దారుణహత్యకు గురైన ఎఫ్.ఆర్.వో. శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.

ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి పలు కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను కూడా అందజేశారు.


SAKSHITHA NEWS