SAKSHITHA NEWS

క్యాంపు కార్యాలయంలో బాణసంచా పేల్చి సంబురాలు


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఆ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ టీపీసీసీ కో ఛైర్మన్ గా పదవి బాధ్యతలు కట్టబెట్టడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై కాంగ్రెస్ జై పొంగులేటి నినాదాలు చేస్తూ బాణసంచాలను పేల్చారు. ఈ సందర్భంగా పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబురాలను ప్రారంభించారు.


SAKSHITHA NEWS