SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

జూలై 2తేదీన ఆదివారం రాహుల్ గాంధీ పాల్గొనే సభ ఏర్పాట్లను పరిశీలించడానికి
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్తూ మార్గ మధ్యంలో చిట్యాల దగ్గర ఉన్న వివేరా హోటల్లో జిల్లా నాయకులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
పోకల దేవదాస్ శాలువా కప్పి స్వాగతం పలికారు. దేవదాస్ తోపాటు జంపాల వెంకన్న ఓబిసి మండల అధ్యక్షుడు చిట్యాల, కాంగ్రెస్ నాయకులు పోకల సామేలు, జట్టా స్వామి, పాల నవీన్, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS