SAKSHITHA NEWS

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS