SAKSHITHA NEWS

సాక్షిత : * ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కుంటల్లో వాటి నిమజ్జనానికి సహకరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపీణీ కార్యక్రమం సితాఫలమండీ ఎం ఎల్ ఏ కార్యాలయంలో జరిగింది. జీ హెచ్ ఎం సి సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఈ పంపిణీ ప్రక్రియను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం చిలకలగుడా మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక నిమజ్జన కుంట నిర్మాణాన్ని పరిశీలించారు. డిప్యూటీ కమీషనర్ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS