SAKSHITHA NEWS

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోదరుడు రఘునాథ్ రావు

పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన టీడీపీ షేక్ రహమాన్, హబీబ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోదరుడు రఘునాథ్ రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు


SAKSHITHA NEWS