SAKSHITHA NEWS

పొంగి పొర్లుతున్న ఫతేపూర్ మూసి వాగు
సాక్షిత శంకర్‌పల్లి మండల పరిధిలోని టంగటూరు, ప్రొద్దుటూరు, మునిసిపల్ పరిధిలోని ఫతేపూర్ వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా టంగటూరు, ప్రొద్దుటూరు, ఫతేపూర్ వాగులోకి వరద నీరు భారీగా చేరుతోంది. టంగుటూరు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలోకి వరదనీరు భారీగా చేరి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ, మునిసిపల్ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు వద్ద ప్రజలు, యువత సెల్ఫీలు దిగి ముచ్చట పడుతున్నారు.


SAKSHITHA NEWS