SAKSHITHA NEWS

5కిలోల గంజాయి స్వాధీనం. ఒక వ్యక్తి అరెస్టు.

విజయనగరం జిల్లా.

విజయనగరం పట్టణం ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద మే 25న గంజాయి అక్రమంగా కలిగిన ఒక వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా సిఐ బి.వెంకటరావు తెలిపారు.

వన్ టౌన్ పోలీసులకు రాబడిన్న పక్కా సమాచారంతో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన బొంతు వెంకటేశ్వర రావు (37సం.లు) అరెస్టు చేసి, అతని వద్ద నుండి 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్ లో వన్ టౌన్ ఎస్ఐలు భాస్కరరావు, రామ గణేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారని, నిందితుడు బోంతు వెంకటేశ్వర రావును రిమాండుకు తరలించామని వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు తెలిపారు.


SAKSHITHA NEWS