SAKSHITHA NEWS

నందమూరు,
పెడన మండలం,

” మరోసారి మానవత్వం చాటుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .”

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ సమాఖ్య కమిటీ అధ్యక్షురాలు మరియు మండల కోశాధికారి శ్రీమతి బెల్లంకొండ వెంకమ్మ అకాల మరణ తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ దిగ్భ్రాంతి గురయ్యారు.

ప్రభుత్వం మరియు పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనే దివంగత వెంకయ్య అకాల మరణం వార్త తెలుసుకొని మంత్రి జోగి రమేష్ వారి ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని నందమూరు గ్రామంలోని జయంతి కాలనీలోని వారి గృహానికి వెళ్లారు.

తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుమార్తెలను, తండ్రి లాగా దగ్గరికి తీసుకుని ఓదార్చి వారి ఆర్థిక పరిస్థితి మరియు విద్యార్హతలు తెలుసుకొని వారి విద్యార్హతకి సరిపడా ఉద్యోగం కల్పించాలని అధికారులు ఆదేశించడమే కాకుండా వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి తాను అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

మంత్రి జోగి రమేష్ ఉదార స్వభావం మరియు వారి మంచి మనసు పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పెడన మండల నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS