SAKSHITHA NEWS

హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సాక్షిత : హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని వారి ఇంటికి వెళ్ళిన మంత్రి

ఉమా మహేశ్వరి కుటుంబం, ఆమె సోదరుడు హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ తదితరులతో మాట్లాడి, వారిని ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్
తెలుగు ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్ళారు

నందమూరి ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు

ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది

శుభకార్యం జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట విషాదం అలుముకోడం బాధాకరం

ఎన్టీఆర్ కుటుంబంతో నాకు 40 ఏండ్ల కు పైగా అనుబంధం ఉంది

వారి కుటుంబ సభ్యులంతా నాకు కుటుంబ సభ్యులే

ఆమె ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతున్నాను.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS