SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.

సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఫస్ట్ టైం ఓటర్లతో కలిసి వర్చువల్ గా కూన శ్రీశైలం గౌడ్ వీక్షించారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కుని రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫస్ట్ టైం ఓటర్లు పోలింగ్ రోజు హాలిడే గా భావించకూడదని, ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయిరాం రెడ్డి, బీజేవైఎం నాయకులు ఒక్కంటి దయాకర్, వారాల మహేష్, జూల సందీప్, డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్, రాజేశ్వరరావు, బీజేవైఎం నాయకులు వేణు గౌడ్, ఈశ్వర్ రెడ్డి, మనీష్, శ్యామ్ కిరణ్ రెడ్డి, తేజ, నాగ, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS