SAKSHITHA NEWS

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి)

గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ సర్పంచ్ మండలి దీప రాములు, (రాములు) తల్లి మండలి నరసమ్మ మరణించారు. విషయం తెలిసిన ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు నరసమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళర్పించి అంతిమయాత్ర లో పాల్గొని పాడే మోసి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మండల ఉపాధ్యక్షులు వెలుగు రవి, జిల్లా ఎస్టీ సెల్ నాయకుల నాగరాజు నాయక్, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, మేడి వెంకన్న, ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, పులకరం వెంకటయ్య, మేడి లింగయ్య, జాల రాములు, జాల మల్లయ్య, నర్ర నారాయణ, పూల సహదేవ్, తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS