SAKSHITHA NEWS

ఘనంగా ఎంపీ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ గుడి సెంటర్ వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను చిట్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గ దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేకు కట్ చేసి టపాసులు కాల్చి మిఠాయిల పంపిణీ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రతి పేద వారికి అండగా ఉన్న ఏకైక నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు గోధుమగడ్డ పద్మ జలందర్ రెడ్డి, జమండ్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి, రేముడాల లింగస్వామి, మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నర్సింహా, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS