SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీ లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయ్యారు.
ఈ బేటీలో తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న క్రిబ్ కో బయో ఇథనాల్ కర్మాగారం వీలయినంత త్వరలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని చెప్పారు.
అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.