SAKSHITHA NEWS

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


SAKSHITHA NEWS