SAKSHITHA NEWS

పేద,మధ్యతరగతి ప్రజలను, దోచుకుంటున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే వనమా
మోడీ హఠావ దేశ్ కి బచావో : ఎమ్మెల్యే వనమా
గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా భారీ ర్యాలీ, ధర్నా మరియు దిష్టిబొమ్మ దహనం


సాక్షిత : కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధర పెంపుకు నిరసనగా * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో* భారీ ర్యాలీ, ధర్నా మరియు బిజెపి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడం పనిగా పెట్టుకుందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల దేశంలో మధ్యతరగతి ప్రజల పరిస్థితి అద్వానంగా తయారైందని, మోడీ హఠావ దేశ్ కి బచావో అని అన్న ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో * వనమా రాఘవేందర్,* జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపీపీలు భుఖ్య విజయలక్ష్మి, బుఖ్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, కాసుల వెంకట్, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, MD. ఉమర్, భీమా శ్రీధర్, రావి రాంబాబు, మసూద్,యూసుఫ్, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, మండల కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS