SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 23వ రోజు దుండిగల్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 23వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లతో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పరిశీలించి త్వరలోనే పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దుండిగల్ సింగపూర్ మైసమ్మ ఆలయం మీదుగా అన్నారం వరకు గల లింకు రోడ్డు ఏర్పాటుకు ఆర్డిపి సిద్ధం చేసి తన దృష్టికి తీసుకురావాలని త్వరలోనే ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవో కింద ఉత్తర్వులు జారీ చేసి పూర్తి చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చివరగా అపర్ణ నుండి సింగపూర్ మైసమ్మ ఆలయంకు రోడ్డు ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ, స్థానిక కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించి సమస్యను పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిపి చినంగి వెంకటేశం, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, జక్కుల కృష్ణా యాదవ్, ఆనంద్, స్థానిక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణా రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, శ్రీను, ఉప్పరి కృష్ణ, వీర స్వామి, ఆకుల భాస్కర్, మాజీ ఎంపీటీసీ నరేందర్, పాండు గౌడ్, బిక్షపతి గౌడ్, మల్లేష్, దొంతి మహేష్, ధార మహేష్, కుమార్ నాయి, యాదగిరి నాయి, ప్రవీణ్ నాయక్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS