SAKSHITHA NEWS

సాక్షిత ; 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని దేవేందర్ నగర్ నర్సింహా బస్తి, హుస్సేన్ బస్తి, పోచమ్మ బస్తి, కట్టమైసమ్మ బస్తి, అబిద్ బస్తిలలో పాదయాత్ర..

దిగ్విజయంగా ప్రగతియాత్ర 98 రోజులు పూర్తిచేసుకొని 99వ రోజులో భాగంగా పాదయాత్రకి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని నర్సింహా బస్తి, హుస్సేన్ బస్తి, పోచమ్మ బస్తి, కట్టమైసమ్మ బస్తి, అబిద్ బస్తిలలో 99వ రోజు ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు.అదేవిదంగా మిగిలి ఉన్న పనులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు, ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులను అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు చేరవేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యయప్రణాళికలు పూర్తిచేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అశీసులతో 99 రోజులు ప్రగతియాత్ర కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసుకొని 100 రోజులకు అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రగతియాత్ర కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గాజులరామారం డిప్యూటీ కమీషనర్ మల్లారెడీ , HMWS జిఎం శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రికల్ డిఈ రఘుపతి, డిఈఈ రూప దేవి, జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS