SAKSHITHA NEWS

గాజులరామారం డివిజన్ ఆర్ కే లేఔట్, మిథిలా నగర్ కాలనీల్లో పాదయాత్ర…

కోట్ల నిధులతో కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 54వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ కే లేఔట్, మిథిలా నగర్ కాలనీల్లో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. మొదటగా ఆర్ కే లేఔట్ లో రూ.1.85 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు, సుమారు రూ.2 కోట్లతో వాటర్ లైన్ పనులు, రూ.1.95 కోట్లతో 5 పార్క్ ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. రూ.89 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

డ్రైనేజీ పనులు పూర్తైన వెంటనే సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ని కోరగా త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. మిథిలా నగర్ కాలనీలో పూర్తిగా వాటర్ పైప్ లైన్ లు పూర్తి చేసినందుకు, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, రు.1 కోటితో భూగర్భడ్రైనేజీ, రూ.10 లక్షలతో వీధి ద్వీపాలు, రూ.1.20 కోట్లతో 5 పార్క్ ల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఈ రూపాదేవి, డిజిఎం అప్పల నాయుడు, ఏఈ కళ్యాణ్, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హరికృష్ణ రెడ్డి, సురేష్ చౌదరి, టాగూర్ రెడ్డి, వంశీ, సత్య ప్రసాద్, సూర్యప్రకాష్, సత్యనారాయణ, ఠాగూర్, సురేష్, శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్, రవీందర్ రెడ్డి, విజయ్ రెడ్డి, విజయ్ కుమార్, రాయుడు, రామకృష్ణ, శ్రీధర్ మరియు సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, మసూద్, పీట్ల మల్లేష్, మహేష్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బైగ్, తిరుపతి, చిన్నా చౌదరి, నవీన్ మరియు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS