SAKSHITHA NEWS

150 మంది మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 150 మంది మహిళా డాక్టర్లు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్ లు, ఎల్టీలు, ఆశా వర్కర్లు మరియు అటెండర్లను చింతల్ లోని తన కార్యాలయం వద్ద ఘనంగా శాలువాలతో సన్మానించి మొమెంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలే సమాజ ప్రగతికి వెలుగు దివ్వెలు అని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అనేక సేవలు అందించడం అభినందనియమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్, నాయకులు విజయ్, నదీమ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS