SAKSHITHA NEWS

కార్మికుల రిలే నిరాహారదీక్షకు హాజరై సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 7 నెలల నుండి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 19వ రోజు కంపెనీ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు అండగా ఉంటామని అన్నారు.

అసెంబ్లీ వేదికగా కార్మికుల సమస్యలను ప్రస్తావించడం జరిగిందన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ తో సమావేశమై కార్మికుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS