SAKSHITHA NEWS

హైదరాబాద్ నందు కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి ముత్యాలగూడెం గ్రామ సర్పంచ్ బొల్లికొండ శ్రీను,కుక్క శ్రీను,బడేటి సురేష్,పాసిని సురేష్,కుక్క రాజేష్,బొల్లికొండ రాములు,ఉడుగు పాపారావు ని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్,మల్లిడి వెంకన్న,ముత్యాలగూడెం ఎంపీటీసీ ఉడుగు జ్యోతి-వెంకటేశ్వర్లు,ముత్యాలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మోతు శ్రీనివాసరావు,చాగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS