SAKSHITHA NEWS

యువత స్వశక్తితో ఎదగాలి – ఎమ్మెల్యే చిరుమర్తి

— చౌటుప్పల్ లో బైక్ పాయింట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చౌటుప్పల్ (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన పాలెం మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన బైక్ పాయింట్ ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.
చౌటుప్పల్ మండల కేంద్రంలో
వలిగొండ రోడ్ లో పాలెం మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ శివ గణేష్ బైక్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత స్వశక్తితో ఎదగాలని పలువురికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
మున్ముందు మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొలను వెంకటేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ బడిగే బాలకృష్ణ, పేరేపల్లి మాజీ సర్పంచ్ కొలను సతీష్ గౌడ్, రామన్నపేట మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఉదయ రెడ్డి, నాయకులు ఏళ్ల సత్యనారాయణ రెడ్డి, తుమ్మల నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS