SAKSHITHA NEWS

సాక్షిత : ఎస్వీ యూనివర్సిటీ పక్కన గల నగరపాలక సంస్థ స్థలంలో నిర్మించనున్న కమిషనర్ బంగ్లా కు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ రెడ్డి, భూమిపూజ చేశారు.*


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ నివాసం కొరకు 150 లక్షల రూపాయలతో నూతనంగా అధునాతనమైన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. ఈ భవన నిర్మాణానికి ఎస్వీయూ ఆవరణలోని మునిసిపల్ స్థలంలో భూమిపూజ చేశామన్నారు. వీలైనంత త్వరగా బంగ్లా నిర్మిస్తారన్నారు.
కమిషనర్ శ్రీమతి హరిత మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ నివాసం ఉండేందుకు వీలుగా ఒక భవన సముదాయాన్ని నిర్మించేందుకు ఎస్వీయూలో గల మునిసిపల్ స్థలంలో భూమిపూజ చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో కమిషనర్ లకు నివాస సముదాయాలు ఉన్నాయని ఇక్కడ లేక పోవడంతో నూతనంగా భవనం నిర్మిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, డి.ఈ.రవీంద్రా రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికష్ణ, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS