SAKSHITHA NEWS

భూపాలపల్లి మున్సిపాలిటీ.

బస్తీ బాటలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు శాంతినగర్ మరియు 17వ వార్డు సుభాష్ కాలోనిల్లో విస్తృతంగా పర్యటించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అడిషనల్ కలెక్టర్ దివాకర్ …

కాలనీ వాసులను నేరుగా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

పలు కాలనీల్లో సైడ్ డ్రైన్ మరియు లింక్ రోడ్డు లు అవసరం ఉన్నాయని తెలుపగ వెంటనే నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

నిత్యం మున్సిపాలిటీ సిబ్బంది వార్డులను శుభ్రంగా ఉంచుకునేల కౌన్సిలర్లు పని చేయాలని కోరారు.

రోడ్డు మధ్యలో నల్ల పైప్ కనెక్షన్ల కోసం గుంతలు తీయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

అధికారులు పనితీరు పై తీవ్రంగా మండిపడ్డారు.

బస్తీబాటలో ఎమ్మెల్యే గారివెంట చైర్మన్ సెగ్గం వెంకట రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, స్థానిక వార్డు కౌన్సిలర్లు రేణుక, మురళి, కమిషనర్ అనిల్ మరియు పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, ఇతర వార్డుల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, పట్టణ మహిళ అధ్యక్షురాలు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS