SAKSHITHA NEWS

సాక్షిత : *కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం సభ్యులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ,మీ అందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ మీ సమస్యల పై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు, కాలనీ లో రోడ్లు ,మంచి నీటి వసతి, విధి దీపాల వంటి మౌలిక వసతులు కలిపిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి సంఘం అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన సంఘం గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి మరియు శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం సభ్యులు ప్రెసిడెంట్ వెంకటేశ్వర రావు , వైస్ ప్రెసిడెంట్ ధనుంజయ్ ,జనరల్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ యేసు బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రావు, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ గోపాల్ కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS