SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పలువురు ప్రజలు ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అధ్యక్షులు కాప సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజయ్ దీరాధర్, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS