SAKSHITHA NEWS

పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజు.

సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజును నియమిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డి. మాధవరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమాజానికి, పాత్రికే వృత్తికి, నిరుపేదలకు ఎండి రాజు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈసీ మెంబర్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎండి రాజు మాట్లాడుతూ పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ తనను ఈసీ మెంబర్గా నియమించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకుంటానని, సంస్థ అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.


SAKSHITHA NEWS