SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా సత్తెనపల్లి

కొరబండి ప్రియాంక కు జై భీమ్ భారత్ పార్టీ, పలువురు నాయకులు నివాళులు.. ——————————————————————————————– భవిష్యత్తు లో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన కొరబండి ప్రియాంక చిన్న వయస్సులోనే అనారోగ్యంతో అకాల మృతి చెందటం విచారకరమని జై భీమ్ భారత్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ కన్వీనర్, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో అంబేడ్కర్ నగర్ లో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయన మాట్లాడారు. ఈమె తండ్రి కొరంబడి కిషోర్ పరివర్తన మానసిక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి మూడు దశాబ్దాలుగా ఎంతో మంది చిన్నారులకు సేవనందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రియాంక కూడా చదువుకుంటూనే తండ్రి బాటలో ఆశ్రమం లో చిన్నారులకు సేవ చేస్తూ బి ఫార్మసీ పూర్తి చేసిందని చెప్పారు.. ఎంతో భవిష్యత్తున్న ఈమె అకాల మృతి వారి కుటుంబానికి , ఆశ్రమం చిన్నారులకు తీరనిలోటు అని ఆవేదం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు ఆమె భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు గుంటూరు ఆశీర్వాదం, అంబేడ్కర్ ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు దావులూరి కోటేశ్వరరావు, మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు కూచిపూడి జాన్ బాబు జూపల్లి పాల్, జడ ప్రసాద్, రమా, డేవిడ్ జై భీమ్ పార్టీ నాయకులు మాతంగి సుధాకర్ రావు, మాలపాటి దేవరాజ్, జడ కమల్ కుమార్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.


SAKSHITHA NEWS