సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ
సాక్షిత:- పరవాడ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్.మల్లిఖార్జునరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ సీఐగా పనిచేసిన ఎస్.బాలసూర్యారావు అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ వీఆర్ లో ఉన్న మల్లిఖార్జునరావును ఇక్కడ సీఐగా ఉన్నతాధికారులు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందు బాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై గట్టి చర్యలు చేపడతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…