SAKSHITHA NEWS

*సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వేడుకలలో భాగంగా హనుమకొండ జిల్లా మడికొండ పారిశ్రామిక కేంద్రం అవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఉత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

ఈ సందర్భంగా మంత్రి జ్యోతి ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక ప్రగతి ని వివరించారు. ఐటీ రంగంలో కెసిఆర్ ఆశీర్వాదంతో, మంత్రి కేటీఆర్ కృషితో సాధించిన ప్రగతి, వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత కార్పొరేటర్, సంబంధిత అధికారులు పారిశ్రామిక కేంద్రంలో పని చేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS